సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని వరంగల్
పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా తెలిపారు. సోమవారం రాత్రి భూపాలపల్లి నియోజక వర్గ పరిధిలోని టేకుమట్ల మండలంలోని గరిమెల్లపల్లి, రేగొండ మండల పరిధిలోని చెన్నాపూర్ లలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
సరైన ఆధారాలు లేకుండా ఉన్న నగదును స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వాహనాల పట్ల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 24 గంటల నిరాటంకంగా చెక్ పోస్టు ల్లో పటిష్ఠ నిఘా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పట్టుకున్న నగదు సీజర్ కమిటీ విచారణ చేపట్టి సక్రమంగా ఉన్నట్లయితే విడుదల చేయాలని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వాహన తనిఖీ విడియో గ్రఫీ చేయాలన్నారు.
===============