ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఆర్డీఓ బి.గంగయ్య

సిరా న్యూస్,పెద్దపల్లి;
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఓటరు అవగాహన 5కే రన్ లో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య ఏ.సి.పి. క్రిష్ణ, సి.ఐ. క్రిష్ణ లతో కలిసి పాల్గొని జెండా ఊపి 5కె రన్ ను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్ నగర్, మసీద్ చౌరస్తా, జండా చౌరస్తా, సుభాష్ విగ్రహం, కమాన్ మీదుగా తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు 5కే రన్ ను నిర్వహించారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించు కోవాలని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరును సరిచూసు కోవాలని, జాబితాలో తమ పేరు లేని పక్షంలో వెంటనే నూతన ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించాలని, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మే 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ వెంకటేష్,తహశీల్దార్ రాజ్ కుమార్, మునిసిపల్, రెవెన్యూ ఉద్యోగులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *