వినియోగదారుల హక్కు చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

 సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;

వినియోగదారులు వినియోగదారుల హక్కు చట్టాలపై అవగాహన కలిగివుండాలి జయశంకర్ భూపాల అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నారుశనీవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచవినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ” వినియోగదారుల కొరకు న్యాయమైన మరియు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు ” అనే థీమ్ పై జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినఅవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారులు అనేక విషయాలలో వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహనలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్య ఉత్పన్నమైన సమయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని అన్నారు. వినియోగదారులు వస్తువులు క్రయవిక్రయాలు చేసేసమయంలో ఇబ్బందులు తలెత్తినా మోసాలకు గురైనా జిల్లా వినియోగదారుల ఫోరంను సంప్రదించవచ్చని తెలిపారు. వినియోగదారుల సమస్యల కోసం నాణ్యమైన వస్తువుల క్రయక్రయాలకు సంబంధించివినియోగదారుల ఫోరం పనిచేస్తుందన్నారు.

సామాన్య ప్రజలకు వినియోగదారుల ఫోరంకు సంబంధించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్నినిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఎల్ డి ఎం తిరుపతి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *