కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
సిరా న్యూస్,పెద్దపల్లి;
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బంధంపల్లి లో గల స్వరూప గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి నాయకుల, కార్యకర్తల సన్నాహక సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా గడ్డం వంశీ ని భారీ మెజారిటీతో గెలిపించేలా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి జడ్పిటిసి బండారి రామ్మూర్తి , జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి పాక్స్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ పాక్స్ చైర్మన్ చదువు రామ్ చంద్రారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సగరవంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణ రావు లు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన వంశీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, అలాగే రైతుల పంటల ఎండుతున్నాయని బిఅర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం సమాజం కాదని, అలాగే వర్షాకాలం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. కొత్త బిచ్చగాళ్ల లాగా బిఅర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. రైతుల పంట ను చివరి గింజ వరకు ఎలాంటి తరగు లేకుండా కొంటామన్నారు. గత ప్రభుత్వo సహజ వనరులను అమ్ముకొని దోచుకున్నారని, 10 ఏళ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నపుడు మీరు ఎం చేశారని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మానేరు వాగు నుండి ఇసుక ను గొంతులో ప్రాణం ఉండంగ అసరమైతే ఎమ్మెల్యే పదవులను వదులుకుంటాం తప్ప ఇసుకను తీయనివ్వం అన్నారు. ఎవరికి తలవచ్చను, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కట్టి ఈ ప్రాంత చివరి ఆయకట్టు వరకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.