మచిలీపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దటానికి అందరూ సహకరించాలి

 సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ శనివారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్, వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి నగరంలో శానిటేషన్, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, నగర పాలక సంస్థ ఆదాయ వ్యయాలపై సమీక్షించారు.నగరంలోఇంటింటి చెత్త సేకరణ గురించి కలెక్టర్ ఆరా తీశారు. వాహనాల ద్వారా చెత్త సేకరణ రెగ్యులర్గా జరగాలన్నారు.శానిటేషన్ సిబ్బంది డివిజన్ల వారీగా ఎంతమంది ఉన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు పడిన వారి నుండి వసూళ్లకు ప్రాధాన్యత నివ్వాలని అధికారుల ఆదేశించారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *