కనకమహాలక్ష్మీ జాతరకు అంతా సిద్దం

సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి 26 వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శివరాత్రి తరువాతి ఆదివారం అమవాస్య కావడం తో పండగ ను మరసటి ఆదివారం నిర్వ హించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ నెల ఆదివారం 17 వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకులు అమ్మవారిని అలంకరించి, మొదటి పూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు .జాతర సందర్భంగా చీపురుపల్లి డిఎస్పీ ,సి ఐ మరియు ఎస్ ఐ , మరియు ఆలయ కమిటీ చైర్ మెన్. ఏర్పాట్లను పరిశీలించారు.
పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది. విద్యుత్తు దీపాల అలంకరణతో పట్టణం మెరిసిపోయేలా చేశారు. ప్రధాన రహదారులను శోభాయమానంగా తీర్చదిద్దారు. అమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన రహదారుల పొడుగునా విద్యుత్తు దీపాలతో అలంకరించారు. భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు.మూడు రోజుల పాటు ఐదు లక్షల వరకు భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి, జాతరను తిలకించనున్నారని అంచనా. ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారంతా విధిగా హాజరవుతుంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *