-పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్
సిరా న్యూస్,మంథని;
స్ట్రాంగ్ రూమ్ లకు ఈవిఎం యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయిందని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ లలో ఈ.వి.ఎం. యంత్రాల తరలింపు ప్రక్రియను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తాతో కలిసి పరిశీలించారు.
పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను మంగళవారం ఉదయం స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచామని కలెక్టర్ తెలిపారు. ఈవిఎం యంత్రాలు స్ట్రాంగ్ రూంకు తరలింపు ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిందని ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా యంత్రాలను తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు జే. అరుణశ్రీ, దివాకర,
బి. గంగయ్య, వి.హనుమా నాయక్, ఏ.సి.పి.లు, సి.ఐలు, మంథని ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి తూము రవీందర్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.