సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
కొలిమిగుండ్ల మండలంలోని పెట్టికోట, మీర్జాపురం, ఇటిక్యాల గ్రామాలలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శనివారం నాడు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించి సంక్షేమ పథకాల పుస్తకాన్ని ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అందజేశారు. రానున్న 2024ఎన్నికల్లో ఓటు వేసి అఖండ మీద గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వర్ రెడ్డి, వి. ఆర్ .లక్ష్మీరెడ్డి, సీనియర్ నాయకుడు ఐ వి .పక్కిరారెడ్డి, పెట్టికోట మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జి .నారాయణ రెడ్డి, పల్లె వెంకటేశ్వర్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, తోట నాగ మల్లారెడ్డి, తోట అమర్నాథ్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, పి. రఘురామిరెడ్డి, అందే రాము, కోటపాడు శివరామిరెడ్డి, చిన్నారెడ్డి, పుల్లారెడ్డి,వై. సత్యనారాయణ రెడ్డి, చిన్నపరెడ్డి, ఇటిక్యాల శివారెడ్డి, వివేక్ రెడ్డి, బి. భాస్కర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నంద్యాల ప్రసాద్, రామ్మోహన్ నాయక్, ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.