సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
గూడెపు జనార్దన్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాంపేట మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి తండ్రి గూడెపు నరసింహారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గా జన సదయ్య, మాజీ సర్పంచ్ సతీష్, ఇనగంటి రవి, మొగిలి సదానందం, తదితరులు ఉన్నారు.