ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సిరా న్యూస్,జగిత్యాల;
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ గా లోక్ సభ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
అన్నారు… సోమవారం స్థానిక విరుపాక్షి గార్డెన్ జిల్లా పోలీసుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హాజరై ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు అధికారుల, సిబ్బంది క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించడం వల్లే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అన్నారు. అవసరమైన ప్రదేశాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసే తనిఖీ లు చేయడం ద్వారా అన్ని రకాల అక్రమ తరలింపులు అడ్డుకోవడం సాధ్యమైందని అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ సందర్భంగా ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికల నిర్వహణ లో కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు..ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్ , భీమ్ రావు ,డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు,డీసీఆర్భీ,ఎస్భీ,సీసీఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, నాగేశ్వర రావు, లక్ష్మీనారాయణ ,రఫీక్ ఖాన్, సి.ఐలు వేణుగోపాల్,రామ్ నరసింహా రెడ్డి,రవి,సురేష్ ,నవీన్,ఆర్ఐ లు
జనీమియ, రామక్రిష్ణ,వేణు, ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.