అలరించిన నౌకాదళ మిలన్ విన్యాసాలు

 సిరా న్యూస్,విశాఖపట్నం;
మిలన్ 2024 లో పాల్గొనేం దుకు వివిధ దేశాల నేవీ అధికారులు విశాఖ చేరుకున్నారు.నిన్నటి నుంచి హార్బర్ దశ కార్యకలాపాలు ప్రారంభ మయ్యా యి. భారత నౌకా దళ పాఠవాన్ని ఇక్కడి సదుపాయా లను ఇతర నేవీ లకు పరిచయం చేసేందుకు కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ తీరానికి వచ్చిన సబర్మతి నౌక లో సమకూర్చిన సబ్ మెరైన్ రెస్క్యూ వాహకం ఎలా పనిచేస్తుందని అంశాన్ని ఇతర నౌకా దళ సిబ్బందికి పరిచయం చేసే కార్యక్రమం నిర్వహిం చింది.విశాఖ ఆర్కే బీచ్లో మిలన్ విన్యాసాల అలరిం చాయి. నౌకా యుద్ధ విమా నాలు, చేతక్ హెలికాప్టర్ల అద్భుత ప్రదర్శన చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. పీఐ 8 హెలికాఫ్టర్లు, సీకింగ్ హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నా యి. అంతర్జాతీయ సిటీ పరేడ్లో భాగం గా పలుదేశాల నేవీ బృందాల ప్రదర్శన విశాఖలో కొనసాగుతోంది. మిలన్ విన్యాసాల సందర్భంగా లేజర్ షో ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *