సిరా న్యూస్,విజయవాడ;
వై నాట్ 175.. ఈ టార్గెట్ను రీచ్ కావాలంటే మార్పే మంత్రమని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరుపై వేర్వేరుగా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను మారుస్తోంది. దీనికోసం సుధీర్గ కసరత్తులు చేస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత సీఎం జగన్.. సామాజిక అంశాలు, బలం, బలగం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జులను ప్రకటిస్తున్నారు. మొదటి విడతలో 11 మంది.. రెండో విడతలో 27 మంది ఇన్ఛార్జులను ప్రకటించిన సీఎం జగన్.. మూడో విడతపై దృష్టిసారించారు. వైసీపీలో మార్పులు-చేర్పులపై తాడేపల్లి కేంద్రంగా కసరత్తు చేస్తున్నారుతొలి, రెండవ జాబితాలతోనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన వైసీపీ అధిష్టానం.. థర్డ్ లిస్టుపై కూడా కసరత్తును వేగవంతం చేసింది. ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా మార్పులు-చేర్పులపై మంతనాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్ల రాకతో సీఎం క్యాంపాఫీసు సందడిగా మారింది. మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాంపాఫీసు దగ్గర కనిపించారు. పోటీలో ఉండబోనని ఇప్పటికే తేల్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సీఎం జగన్ ను కలవడానికి వచ్చారు.సుధీర్ఘ చర్చల తర్వాత రేపటిలోగా మూడో విడత ఇన్చార్జ్ల తుది జాబితా వెలువడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మూడో లిస్ట్లో 10 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరగుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది..అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంది. ఇప్పటికే కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ రెండు లిస్టులను వైసీపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అధికారం కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫస్ట్, సెకండ్ లిస్టులను పార్టీ విడుదల చేసింది. 2024 ఎన్నికల టీమ్పై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తే ..ఈసారి వారిలో కొందరికి గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను, నియోజకవర్గాలను తారుమారు చేసి బరిలోకి దింపాలని చూస్తు్న్నా్రు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11మందికి నియోజకవర్గ ఇన్చార్జులుగా ప్రకటించారు. అటుపై రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27మంది నేతలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక ఇప్పుడు మూడో లిస్ట్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈజాబితాలో కూడా 10-15మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు, పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తులను అధిష్టానం బుజ్జగిస్తోంది. వారికి ఏదో విధంగా పదవులు కట్టబెడతామని హామీతో కూల్ చేస్తోంది. రెండోసారి అధికారంలో రావాలని జగన్ ఇస్తున్న ధైర్యంతో నియోజకవర్గాలు మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుుడు పోటీకి సై అంటున్నారు.