సిరా న్యూస్,రాయ్ పూర్;
ఛత్తీస్గఢ్లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్లోని బోర్సీ గ్రామంలో గన్పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. స్పెషల్ బ్లాస్ట్ కంపేనిని ముందునుంచే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తాజా ఘటనలో మృతుల సంఖ్య ఇంకా తేలలేదు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. పదుల సంఖ్యలో మృతులుండవచ్చని అనుమనిస్తున్నారు. పేలుడు ధాటికి ఘటనస్థలిలో 20 అడుగుల గోతి ఏర్పడింది.
==================