సిరా న్యూస్,నెల్లూరు;
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని జాతీయ రహదారి పక్కన వున్నమదీనా టపాసుల కేంద్రం లో ప్రమాదవశాత్తు నిప్పు పడడం వల్ల టపాసులు పేలాయి. ఘటనలో,టపాసులు తయారు చేస్తున్న ముగ్గురు కి తీవ్ర గాయాలయ్యాయి, గాయాలు పాలయిన వారి పరిస్థితి విషమం గా వుంది. గాయాలు పాలైన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆర్డీవో చంద్రమని, పోలీసులు ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు