జాబ్ వచ్చిందని ట్రీట్ అడిగాడు… తీరా హోటల్ కి వెళ్తే…

జాబ్ వచ్చిందని ట్రీట్ అడిగాడు… తీరా హోటల్ కి వెళ్తే…

మద్యం ఇచ్చి అత్యాచారం

-చిన్ననాటి స్నేహితుడి ఘాతుకం

సిరా న్యూస్,రంగారెడ్డి;
వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డి మరియు మరో వ్యక్తి అత్యాచారం కి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం బాధితురాలు, గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్ లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కి వచ్చారు, అక్కడే అనంతరం బార్ లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్ కి వెళ్ళారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి తో పాటు మరో వ్యక్తి రూమ్ లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. దీనితో హోటల్ సిబ్బంది రూమ్ కు వెళ్లడంతో రూమ్ లో ఉన్న ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండడంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
హోటల్ సిబ్బంది. బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు పోలీసులకు సమాచారం అందించడతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు, గౌతమ్ రెడ్డి మరియు అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి మాట్లాడుతూ నిన్న రాత్రి అమ్మాయి కి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని సందర్భంగా తన చిన్ననాటి మిత్రుడు గౌతంరెడ్డి ట్రీట్ ఇవ్వమని కోరగా ఓంకార్ నగర్ లో ఆన్న బొమ్మరిల్లు బార్ & రెస్టారెస్ట్ లో ట్రీట్ ఏర్పాటు చేసుకున్నారు. తరువాత ఘటన జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *