వడ్డే, పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని పెద్దగోపతి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సన్మాన కార్యక్రమంలో వివాదం చెలరేగింది. కొణిజర్ల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గ పోరు బహిర్గతమైంది.