గుంటూరులో ఫ్యాక్షన్ దారుణాలు

సిరా న్యూస్,గుంటూరు;
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు పేరు చెప్పనక్కర్లేదు. పౌరుషానికి కేరాఫ్‌గా చెబుతారు. మాచర్ల పేరు చెబుతే చాలా ఫ్యాక్షన్ దారుణాలు గుర్తు కొస్తాయి. ఇదంతా ఒకప్పుటి మాట… ఇప్పుడూ అక్కడక్కడ ఉన్నాయనుకోండి. కాకపోతే మునుపటి మాదిరిగా లేవన్నది స్థానికులు చెబుతున్నమాట. అక్కడి రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు. రావణ కాష్టంలా భగభగమంటాయి.అసలు విషయానికి కొద్దాం. బుధవారం రాత్రి మాచర్ల నియోజకవర్గంలోని శిరిగిరిపాడు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ టీడీపీ కేడర్ రాళ్ల దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలియగానే వైసీపీ కేడర్ అలర్టయ్యింది. వెంటనే పిన్నెల్లి మద్దతుదారులు మాచర్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు.
===========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *