సిరాన్యూస్,బేల
సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో మరో రెండు పథకాలను అమలు చేయడం పట్ల మండల కాంగ్రెస్ శ్రేణులు పాలభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు అని పేర్కొన్నారు.పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుకు హర్షిస్తున్నామని అన్నారు.ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు అని అన్నారు.ఈ దశలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,200కి పెంచిందని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు.ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తమ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే,మాజీ ఎంపీపీ బాపూరావ్ హుల్కె, కిసాన్ సీల్ మండల అధ్యక్షుడు గన్ శ్యామ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నానాజీ పాటిల్, విలాస్ పాటిల్, శంకర్ బొక్రె, రాజు, మాజీ సర్పంచ్ రూప్ రావ్, మోబిన్,విట్టల్ దేవతడే తదితరులు పాల్గొన్నారు.