Faizullah Khan: ఆదివాసీ బిడ్డను గెలిపిద్దాం…అభివృద్ధి చేసుకుందాం:  మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్

సిరా న్యూస్,బేల
ఆదివాసీ బిడ్డను గెలిపిద్దాం…అభివృద్ధి చేసుకుందాం:  మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఆదివాసీ బిడ్డ‌ ఆత్రం సుగుణను గెలిపించి అభివృద్ది చేసుకుందామ‌ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల, గొండు గూడ, కొలాం గూడ గ్రామాలలో సోమవారం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన నిరుపేదలకు 200 యూనిట్ల విద్యుత్తు, 500 రూపాయలకే వంట గ్యాస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ కష్టపడే నాయకురాలు ఆత్రం సుగుణక్కకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఈ ప్రచారంలో విలాస్ పటేల్, ఠాక్రే సాగర్ ,మాజీ సర్పంచ్ దౌలత్ రావు దొటే, అనిల్ వికాస్, బైరాందేవ్, కుంటవార్ రాం రెడ్డి, నానాజీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *