సిరాన్యూస్, బేల
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: మండల పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ కోసం గడప గడప కు వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ర్టంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీలలో కొన్ని అమలు చేసింది మరి కొన్ని కచ్చితంగా అన్ని హామీలు అమలు చేస్తోందని అన్నారు.రైతులకు 2 లక్షల పంట రుణ మాఫీ 15 ఆగష్టు లోపు తప్పక మాఫీ చేస్తుందన్నరు. కానీ గతం లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గత 10 సంవత్సరాలలో పూర్తి చేయని వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉన్నదని అన్నారు. ఈ ప్రచారం లో మాజీ జడ్పిటిసి రాందాస్ నాక్లే మండల నాయకులు విలాస్ పటేల్, ఘనశ్యామ్, రూపేష్ రెడ్డి, శంకర్ మాజీ సర్పంచులు దౌలత్ రావు, బాపు రావు గంభీర్, సూర్యభాన్, అవినాష్, నారాయణ రెడ్డి, గులాబ్ ధోటే, అనిల్, పురుషోత్తం రెడ్డి, రాంరెడ్డి, రాజు, చిన్న గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సైఫుల్ల ఖాన్, ఆనంద్ రావు పాల్గొన్నారు.