సిరా న్యూస్,రంగారెడ్డి;
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాదీనం చేసుకున్నారు. బుద్వేల్ లోని గ్రీన్ సిటీ లో గోప్యంగా అప్న ఎంటర్ప్రైసెస్ అనే పేరు పై ఫ్యాక్టరీనీ అమీర్ నిజాన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అక్రమంగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్ మరియు కెమికల్ వాటర్ వాడుతున్నట్లు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలువాల్సి ఉంది
====