లోకేశ్వరం, సిరా న్యూస్
పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలి
పంటల రక్షణకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పసుపు తీయాలంటే చీడపీడలను నాశనం చేయాలన్నారు. పసుపుకు ఉపయోగపడే యంత్రాలను సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు వీటిని ఉపయోగించుకుని దిగుబడులు పొందాలని కోరారు. రైతులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.