Farmers: పంటల కోసం సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి

లోకేశ్వరం, సిరా న్యూస్ 

పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలి 

పంటల రక్షణకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో  పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పసుపు తీయాలంటే చీడపీడలను నాశనం చేయాలన్నారు. పసుపుకు ఉపయోగపడే యంత్రాలను సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు వీటిని ఉపయోగించుకుని దిగుబడులు పొందాలని కోరారు. రైతులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *