Farmers: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

బేల, సిరా న్యూస్ 

కందుల కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే 

రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం 

రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాపెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు.  ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు ప్రారంభిస్తూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుందన్నారు. మార్కెట్లో కందుల ధరలు అధికంగా ఉండడంతో దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనుగోలు జరపాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు దాదాపు 50 వేల క్వింటాళ్లు కందులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. త్వరలో మండలాల్లో కూడా కందుల కొనుగోలు ప్రారంభించే ఏర్పాట్లు చేస్తామన్నారు. 50వేల క్వింటాళ్లు కొనుగోలు అయిన తర్వాత అదనంగా మరో 50 వేల క్వింటాళ్లు ఉన్నా కానీ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు.  కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇంద్రశేఖర్,అధికారులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *