Farmers: రైతుల దీక్షలు పట్టవా?

బేల, సిరా న్యూస్ 

రైతుల గోడు పట్టించుకోవాలని వినతి

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరుకున్న ఏ ఒక్క అధికారి న్యాయం కోసం వస్తలేరు అని రైతులు వాపోతున్నారు. రైతు దేశముఖ్ ఉత్తం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయింది కానీ రైతులకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదన్నారు. మహారాష్ట్ర రాజుల నుంచి తెలంగాణ బోరజ్ వరకు ఎటువంటి బైపాస్ రోడ్డు లేదు కానీ బేల మండలంలో ధోప్టల, శంషాబాద్, బేల, మొహబ్బత్ పూర్, బురాన్ పూర్ పొలాల నుంచి బైపాస్ రోడ్డు కోసం సర్వే చేయడం సరికాదన్నారు. తమకు ఉన్న రెండు, మూడు ఎకరాల భూమి నుంచి బైపాస్ రోడ్డు పోతే తమ కుటుంబం చావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు కొందరు వ్యాపారుల లాభం కోసం తమ బతుకులు బుగ్గిపాలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. తమ దీక్షను రాజకీయంగా చూడకుండా ప్రతి ఒక్క నాయకులు మద్దతు ఇవ్వాలని రైతులు కోరారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీపీ, వనిత గంభీర్ ఠాక్రే, జడ్పీటీసీ అక్షిత సతీష్ పవర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, నాయకులు మస్కే తేజ్ రావ్, తన్వీర్ ఖాన్, షేక్ సులేమాన్ పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *