అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

సిరా న్యూస్,అమరావతి;
అమరావతి రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున తుళ్లూరు మండలం వెంకట పాలెం లో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా వెంకటపాలెం కి చెందిన నలుగురు రైతుల ప్లాట్లలో మట్టితవుతున్నారు. ఉద్దండరాయన పాలానికి చెందిన కొంతమంది వ్యక్తులు మట్టి తరలిస్తున్నారని రైతుల ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున మట్టితోవుతున్న వారిని రైతులు పట్టుకోగా తాడేపల్లి నుంచి వచ్చామని
చెప్పడంతో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంకట పాలానికి వచ్చి జెసిబి, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసులు గట్టి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *