బ్యాంకుల ముందు బారులు తీరిన రైతులు

సిరా న్యూస్,మహబూబాబాద్;
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన రైతులు గత రెండు రోజులుగా పంట పొలాలు వదిలి బ్యాంక్ ల వద్ద బారులు తీరారు. నేల్లికుదురు మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంక్ వద్ద క్యు లైన్ లో నిలబడి రద్దీని తట్టుకోలేక చెప్పులు పెట్టీ తమ వంతును తీర్చుకుంటున్నారు.బ్యాంక్ అధికారులు బ్యాంక్ లోపటికి రానివ్వకపోవడంతో భారీగా క్యు లైన్ పెరిగింది. బ్యాంక్ అధికారులపై ప్రభుత్వంపై రైతులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ లోపటికి చేరుకొని అడిగిన రైతులకు ప్రభుత్వం నుండి నీ పేరు రాలేదు మాకు ఏమీ తెల్వదు. నీ అప్పు అలాగే ఉంది. నీకు రుణమాఫీ కాలేదని సమాధానం చెప్పుతుండటంతో రైతులు బాధతో వెనుతిరుగుతున్నారు. కొందరు రైతులకు నీ అప్పు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నది మొదలు ఎక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే మిగతాది మాఫీ అవుతుంది అని వివిధ రకాలుగా అధికారులు చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
గత కాంగ్రెస్ పాలనలో విత్తనాలు ఎరువుల కోసం అనాడు చెప్పులు క్యు లో పెట్టీ నిల్చున్న నాటి పరిస్థుతులు మళ్ళీ దాపురించాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైన ఇచ్చిన మాట ప్రకారం అందరి రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *