జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి
సిరా న్యూస్,పెద్దపల్లి;
నేడు ఉదయం 10 నుంచి 11-30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించి శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేస్తారని, ఇట్టి కార్యక్రమాన్ని జిల్లాలోని రైతు వేదికలలో ప్రదర్శించు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సోమవారం తెలిపారు. వరిలో ప్రస్తుతం పాటించవలసిన మెలకువలపై డాక్టర్ బి. శ్రీనివాస్ జగిత్యాల నుంచి రైతులకు సూచనలు అందిస్తారని, అనంతరం ఆయిల్ పామ్ సాగులో తీసుకోవాల్సిన మెలకువల గురించి డాక్టర్ రాజశేఖర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి రైతులకు సలహాలు ఇస్తారని, డాక్టర్ కే.కవిత వేసవిలో సాగు చేసే కూరగాయలు వాటిపై వాడే పురుగు మందు అవశేషాల గురించి రైతులకు వివరిస్తారని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించు రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి పాల్గొంటారని, రైతులంతా తమ, తమ రైతు వేదికల నుండి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు.