నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహిళ మృతి 12 మందికి తీవ్ర గాయాలు

సిరా న్యూస్,నాగర్ కర్నూల్;

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి;
మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉగాది పర్వదినం సందర్భంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లన్న భక్తులు 13మందితో కలిసి క్రూజర్లో శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బిజినపల్లికి చేరుకోగానే డివైడర్ను వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా ప్రాంతానికి చెందిన వందన (45) అక్కడికక్కడే మృతి చెందగా అదే ప్రాంతానికి చెందిన మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో సరైన సమయానికి పోలీసులు లేకపోవడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ డివైడర్ అసంపూర్తితో పాటు సూచిక బోర్డులు లేకపోవడంతో ఎన్నో వాహనాలు ఢీకొని ఎందరో ప్రాణాలు పోయినా కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *