నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద మూడు వాహనాలు డీ కొన్నాయి. ఇనుముతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. వెంటనే ఆ లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రావెల్‌ బస్సుపై దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో చాలా మంది బస్సులో ఇరుక్కున్నారు. వారిని తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మృతులకు కన్నీటి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *