రిపబ్లిక్ డే రోజు ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీలు మృతి
 సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నరసరావుపేట మధ్య ఉన్న కావూరు లింగుంట్ల గ్రామం చెక్కపోస్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నుంచి చిలకలూరిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. బస్సు కూడా రోడ్డు మీద నుంచి పొలాల్లోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *