సిరా న్యూస్;
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీ నష్టాలతో మొదలైంది. 2400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ 2600 పాయింట్ల వరకు నష్టాలను చూసింది.ఇక నిఫ్టీ సైతం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలు చూసింది. చివర్లో కోలుకుని 24,000కి పైన ముగిసినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 729 పాయింట్ల నష్టంలో 23,983 వద్ద ట్రేడ్ అయింది.గత వారం 25 వేల మార్కును తాకి రికార్డు సృష్టించిన నిఫ్టీ వారం చివర్లో మాత్రం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంది.ప్రస్తుతం అంతర్జాతీయంగా వస్తోన్న ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లూ నష్టాలు చవిచూశాయి. అమెరికా విడుదల చేసిన జులై నెల జాబ్స్ డేటాలో అంచనాల కంటే ఉద్యోగాల కల్పన తగ్గిపోయినట్లు తేలింది.నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో ఆ దేశంలో మాంద్యం భయం మొదలైంది.దీంతో అక్కడి మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.దీంతోపాటు మిడిల్ ఈస్ట్లో జియోపాలిటిక్స్ ప్రమాదకరంగా మారాయి. ఈ భయాలన్నీ ప్రస్తుతం ఆసియా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి.జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ ఏకంగా 13 శాతం క్రాష్ అయి ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయింది.2011 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత జపాన్ నిక్కీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను చూడడం మళ్లీ ఇప్పుడే.తైవాన్లోని ప్రధాన స్టాక్ సూచీ కూడా 7.7 శాతం నష్టపోయింది. చిప్ దిగ్గజం టీఎస్ఎంసీ షేర్లు 8.4 శాతం పడిపోయాయి.దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 6.6 శాతం పడింది. శాంసంగ్తో పాటు చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నష్టాలు పాలయ్యాయి.క్రిప్టోకరెన్సీలు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఒక బిట్ కాయిన్ ధర 53 వేల డాలర్లకు చేరుకుంది. ఫిబ్రవరి నుంచి ఇదే కనిష్ఠ స్థాయి.భారత్, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, షాంఘై అన్ని స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.
స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుండటంతో డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా జీవన కాల కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది.డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం రూ. 83.75గా ఉంటే.. సోమవారం రూ. 83.85 వద్ద ట్రేడైంది.
ఇదే సమయంలో బ్యాంకు ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికా డాలర్తో పోలిస్తే యెన్ బలపడింది.విదేశీ ఇన్వెస్టర్లకు టోక్యో స్టాక్స్ మరింత ఖరీదైనవిగా మారాయి.గ్లోబల్ మార్కెట్ల పతనం, అమెరికాలో మాంద్యం భయాలు, జియోపాలిటిక్స్ కారణంగా రూపాయి విలువ పడిపోయిందని విశ్లేషకులు చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.అమెరికాలో మాంద్యం భయాలతో భారత్, ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు.జులై జాబ్స్ డేటా అంచనాల కంటే తగ్గడంతో అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లకు కోత పెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.వాస్తవానికి ఇటీవల బలహీనమోన ఆర్థిక డేటా మధ్య అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా రానున్న కాలంలో మానిటరీ పాలసీ కింద వడ్డీ రేట్లను వేగంగా సెప్టెంబర్ నుంచి తగ్గిస్తుందనే ఊహాగానాలు ఈ పరిస్థితులకు దారి తీశాయి. అమెరికాలో జూన్ డేటా ప్రకారం ఊహించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని డేటా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 17-18 మధ్య జరగనున్న సమావేశంలో అర శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించవచ్చను అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే గోల్డ్ మాన్ సాచ్స్, సిటీ గ్రూప్, జేపీ మోర్గన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు సైతం సెప్టెంబర్, డిసెంబర్ సమావేశాల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండొచ్చని ఇప్పటికే సూచిస్తున్నాయి. JP మోర్గాన్ కూడా ఫెడ్ తదుపరి షెడ్యూల్ సమావేశానికి ముందు ఆఫ్-సైకిల్ రేటు తగ్గింపుకు బలమైన అవకాశాన్ని సూచించింది. గ్లోబల్ మార్కెట్లు ఫెడ్ జాగ్రత్త వైఖరికి ప్రతికూలంగా ప్రతిస్పందించాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ సోమవారం 14 శాతానికి పైగా పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ బిగుతును కొనసాగిస్తుందనే అంచనాలతో యెన్ ఒక శాతం కంటే ఎక్కువ ర్యాలీ చేసింది. US ఫ్యూచర్స్ పడిపోయాయి. S&P 500 ఫ్యూచర్స్ 2.64 శాతం తగ్గగా, నాస్డాక్ ఫ్యూచర్స్ దాదాపు 5 శాతం తగ్గాయి. చాలా మంది ఈ సారి షెడ్యూల్ మీటింగ్ ముందే ఫెడ్ రేట్ల తగ్గింపుకు వెళ్లొచ్చని బెట్ వేస్తుండగా, బలమైన కారణాలు లేకుండా ఇకపై రేట్ల తగ్గింపులను ఆపలేదని నిపుణులు ఊహిస్తున్నారు. ఇదే క్రమంలో వడ్డీ రేట్లను రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయిలో ఉంచాలన్న ఫెడ్ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో గోల్డ్మన్ సాచ్స్ ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికా మాంద్యం సంభావ్యతను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. అయితే తిరోగమనానికి భయపడకుండా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చెడు వార్తల కారణంగా బేర్స్ రంగంలోకి దిగటంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. జపాన్లో వడ్డీ రేటు పెంపు తర్వాత, రివర్స్ యెన్ క్యారీ ట్రేడ్ భయం ప్రారంభ ఉత్ప్రేరకంగా నిలవగా.. అమెరికాలో అత్యంత పేలవమైన జాబ్ డేటా మాంద్యం ఏర్పడుతుందనే భయాలను మరింతగా పెంచిందని అన్నారు. ఈ క్రమంలో చైనా, యూరప్ ఇప్పటికే మందగమనంతో సతమతమవుతుండటంతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని మీనా వెల్లడించారు. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో, దేశీయ ఇన్వెస్టర్ల సంపద రూ.17 లక్షల కోట్లు హరించుకుపోయిందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.బీఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.16 లక్షల కోట్లకు పడిపోయిందని తెలిపింది.జులై 2 తర్వాత తొలిసారి నిఫ్టీ 24 వేల మార్కు కిందకు వచ్చినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. బడ్జెట్ డే రోజు నిఫ్టీ 24,074కి పడిపోయింది.