సిరా న్యూస్, జైనథ్:
ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను సన్మానించిన అధికారులు…
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను అధికారులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేను ఏఎంసీ కార్యదర్శి మధుకర్, పీఏసీఎస్ సీఈవో గంగన్నలు పూల బోకే అందిచి, అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా మార్కెట్కు వచ్చిన ఆయన్ను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.