సిరా న్యూస్,ఏలూరు…
ఏలూరు లో హనుమాన్ నగర్ 114, 115 పోలింగ్ బూత్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఓటర్లను ఆహ్వానిస్తూ మామిడి తోరణాలు, అరటి చెట్లు, బెలూన్ డెకరేషన్ తో పండగ వాతావరణం కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానా, త్రాగునీరు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసారు. ఓటు వేసేందుకు వచ్చి ఏర్పాట్లపై ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.