సిరా న్యూస్,అమరావతి;
ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో 10 డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్రం నలుమూలల నుంచి తాడేపల్లి లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. తమ డిమాండ్లు పరిష్కారం కోసం వినతి పత్రం అందజేసేందుకు వస్తే పోలీసులు కార్యాలయ గేట్లను మూసివేసి తమను దూరంగా తరిమివేశారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మండేస్ టార్గెట్ విధానం రద్దుచేసి అందరికీ ఎఫ్.టి.ఈ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.
ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం . ప్రారంభ ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదరిక నిర్మూలన వలసల నివారణలో భాగంగా గత 17 సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామపంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి . అర్హత అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇవ్వాలి. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు రోజుకు వేతనం 600 కు పెంచాలని డిమాండ్ చేసారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కమిషనర్ కార్యాలయం వద్దకు చేరు కోగా నే పోలీసులు కార్యాలయ గేట్లను మూసివేసి అడ్డుగా నిలబడ్డారు .
—