ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారు

బద్వేలుకు బొజ్జ రోశన్న
 సిరా న్యూస్,బద్వేలు;

ఉమ్మడి కడప జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో రిజర్వు నియోజకవర్గమైన బద్వేలుకు బొజ్జ రోశన్న
మైదుకూరు అసెంబ్లీకి టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పులివెందుల అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జమ్మలమడుగు అసెంబ్లీకి భూపేష్ రెడ్డి కమలాపురం అసెంబ్లీకి పుత్త కుటుంబీకులకు కేటాయించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. బద్వేల్ కు బొజ్జ రోశన్న అభ్యర్థిత్వం ఖరారు చేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి సిఫారస్తో ఆయన ఎంపిక జరిగింది. కడప పార్లమెంట్ పరిధిలోని ఒక్క పొద్దుటూరులోనే టిడిపి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సీఎం సురేష్ ఇక్కడ పోటీ పడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నాయి. ఈ మూడింటిలో ఇంకా ఏ అసెంబ్లీకి అభ్యర్థులను ఖరారు చేయలేదు.
రాయచోటి అసెంబ్లీకి టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి పార్టీ నేత రాంప్రసాద్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బామ్మర్ది ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ నియోజవర్గానికి పోటీ ఎక్కువగా ఉంది. గంట నరహరి జగన్మోహన్ రాజు సుబ్బారెడ్డి చెంగల్ నాయుడు పోటీలో ఉన్నారు .రైల్వే కోడూరు ఎస్సీ నియోజవర్గానికి రేవతి అనిత దీప్తి ఇక్కడి నుండి పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని టిడిపి అధిష్టానం భావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *