సిరా న్యూస్, ఆదిలాబాద్:
నడుస్తున్న వాహనంలో మంటలు
+ కాలిబూడిదైన మ్యాక్స్ పికప్ వహానం
+ లబోదిబోమంటున్న బాధితుడు సిడం శంకర్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామానికి చెందిన సిడం శంకర్కు చెందిన మ్యాక్స్ పికప్ వహానం మంటల్లో కాలి బూడిదైంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం… సిడం శంకర్ సోమవారం ఉదయం పత్తి లోడ్తో కూర నుండి ఆదిలాబాద్కు వెళ్లాడు. లోడ్ ఖాలీ చేసి సాయంత్రం ఆదిలాబాద్ నుండి స్వగ్రామానికి తిరుగి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమద్యలో జైనథ్ ఐబీ చౌరస్తా దాటిన తరువాత దీపాయిగూడ రోడ్డు గుండా వెళ్తుండగా సుమారు 7గంటల సమయంలో ఒక్కసారిగా వాహనంలో మంటలు వ్యాపించాయి. మంటలను గ్రహించిన శంకర్ వహానం దిగి బయటకు వెళ్లడంతో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కానీ వహానం మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో బూడిదే మిగిలిందని ఆయన చెబుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.