సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు వేణుగోపాల స్వామి దేవస్థానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధనుర్మాసం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సిబ్బంది బాణాసంచా పేల్చారు. బాణాసంచా నిప్పురవ్వలు గోశాలలోని గడ్డివాము పై పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్త మైనటువంటి సిబ్బంది గోవులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హుటా హుటన స్పందించిన అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. కొద్దిసేపు మంటల వేడికి గోవులు తలడిలి పోయాయి.