నాగావ్ రైలు లో మంటలు..ప్రయాణికులు సురక్షితం

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా కావలి సమీపంలో 15630 నాగావ్ ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి. రైలు అసోం లో సిల్ఘాట్ నుంచి తాంబరం వస్తుండగా ఘటన జరిగింది. ఒక్కసారిగా పొగలు రావడంతో బోగి నుండి ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. జనరల్ బోగి బ్రేక్ పట్టేయడంతో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. బొగిలో పొగలను గమనించి లోకో పైలెట్ రైలును నిలిపివేసాడు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతోఅందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప మరమ్మత్తుల అనంతరం రైలు తాంబరం బయలుదేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *