సిరా న్యూస్,నల్లగొండ;
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవoలో భాగంగా ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తులు – నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. పర్వత వాహనంపై స్వామివార్లను ఆశీనులుగా ఉంచి వీర ముష్టి వంశీయులతో మొదట జలు జరిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరుగకుండా పోలీసు శాఖ గట్టి బందబస్తు ఏర్పాటు చేసారు. అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే పంటలు బాగా పండుతాయని,తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.