సిరా న్యూస్, చిగురుమామిడి
ఫస్ట్ ఏఎన్ఎం లను నియమించేది ఎప్పుడో..?
* ఏళ్ళు గడుస్తున్నా భర్తీకానీ ఫస్ట్ ఏఎన్ఎం పోస్టులు
* సెకండ్ ఏఎన్ఎంలతోనే కాలంగడుపుతున్న వైద్యశాఖ
* సెకండ్ ఏఎన్ఎంలపై పెరుగుతున్న పని భారం
* భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలైన బొమ్మనపల్లి, రేకొండ ఇందుర్తి మూడు గ్రామాల్లో వైద్య సేవలు కరువయ్యాయి. ఫస్ట్ ఏఎన్ ఎం పోస్టు ఖాళీ అయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు భర్తీ చేయకపోవడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు పల్లె దవాఖాన ల ద్వారా వైద్యం అందుతోంది.. ఫస్ట్ ఏఎన్ ఎం ల ద్వారానే గ్రామ ప్రజలకు కీలకమైన వైద్య సేవలు అందుతాయి.ప్రజలకు అందించే 36 రకాల వైద్య సేవలు అందించి, వాటిని ఆన్లైన్ లో నమోదు చెయ్యడానికి ఫస్ట్ ఏఎన్ ఎం లదే కీలక పాత్ర వహిస్తాయి. సెకండ్ ఏఎన్ ఎం లు జి స్వరూప బొమ్మనపల్లి ఉల్లంపల్లి 2 గ్రామాలు. రొంటల శైలజా రేకొండ పెద్దమ్మపల్లి 2 గ్రామాలు. జెళ్ల కవిత ఇందుర్తి, ఓగులాపూర్, గునుకులపల్లి, కునంచనపల్లి 4గ్రామాలు. ఈ విధంగా సెకండ్ ఏఎన్ ఎం లే 10 గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.సెకండ్ ఏఎన్ఎంలు ఆశ, అంగన్వాడి కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ వైద్య సేవలు అందిస్తున్నారు.కరీంనగర్ జిల్లా డిహెచ్ఎంవో స్పందించి మూడు గ్రామాల్లో ఫస్ట్ ఏఎన్ఎం లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే కీలకమైన ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణి కనబడుతుందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి (జి స్వరూప.. సెకండ్ ఏఎన్ఎం బొమ్మనపల్లి)
ఫస్ట్ ఏఎన్ ఎం లేకపోవడంతో వైద్య సేవలు అందించడం కష్టంగా మారింది. జిల్లా డీఎంహెచ్వో స్పందించి ఖాళీగా ఉన్న ఫస్ట్ ఏఎన్ఎంలను భర్తీ చేయాలి. పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందించగలుగుతాం.