సిరా న్యూస్,విశాఖపట్నం;
లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థి ని ఆత్మహత్య చేసుకున్న కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. స్టూడెంట్ సూసైడ్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. భాను ప్రవీణ్, ఉషారాణి, శంకర్ వర్మ, ప్రదీప్ కుమార్, శంకర్ రావులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ రావు వేధింపుల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. విద్యార్థి నుల పట్ల ల్యాబ్ టెక్నీషియాన్ శంకర రావు అనుచ్చితంగా ప్రవర్తన,లైంగిక వేధింపులే ఆత్మహత్య కు కారణమని విశాఖ డీసీపీ-1 మణికంఠ స్పష్టం చేశారు.చాలా మంది విద్యార్థినులను విచారించిన తరువాత సంకర్రావు ను నిందితుదిగా గుర్తించామని తెలిపారు. అందుకే హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ తో ,పాటు మరో ముగ్గురు ఈ కేసులో ఉన్నారని చెప్పారు.
===============