సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో గతరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1.9 కిలోల ఎండు గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదు మంది నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు.పటాన్ చేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
=====