బందరు టీడీపీ కార్యాలయంలో జెండా వందనం

 సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భవనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేసి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన నాయకులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *