తేలని కమలదళం !

అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించని బిజెపి అధిష్టానం

జమ్మలమడుగు, బద్వేలు అసెంబ్లీ స్థానాలపై గందరగోళం

జమ్మలమడుగు బరిలో దిగనున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ?

బద్వేలు అసెంబ్లీ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్

దింపుడు కళ్లెం ఆశలతో తెలుగుదేశం నేతలు

సిరా న్యూస్,బద్వేలు;

ఎన్నికల షెడ్యూల్ వచ్చింది సీట్ల సర్దుబాటు పొత్తుల కరారు అన్ని ఒక కొలిక్కి రావడంతో పోటీ చేసే అభ్యర్థులను అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించున్నాయి. రాష్ట్రంలో అధికార వైసిపి అభ్యర్థుల జాబితాను రెండు రోజుల క్రితమే ప్రకటించా.రు తెలుగుదేశం పార్టీ కూడా రెండు విడతల్లో 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలపై కసరత్తు చేస్తుం.ది జనసేన పార్టీ కూడా ఇప్పటికే రెండు జాబితాలలో అభ్యర్థులను ప్రకటించింది. కానీ బిజెపి మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కేంద్ర నాయకత్వం పరిశీలనలో జాబితా ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. సంబంధించి పొత్తుల్లో భాగంగా బద్వేలు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాలు బిజెపికి దక్కాయి. ఈ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కొంత గంధరగోళం నెలకొని ఉంది. జమ్మలమడుగు నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం ఉన్న బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి ఎవరిని ఇప్పటికీ స్పష్టత లేదు.
తెలుగుదేశం జనసేన బిజెపి పొత్తులపై ఇప్పటికే ఆయా పార్టీలు స్పష్టత ఇచ్చాయి. జనసేన బిజెపి పార్టీలకు కేటాయించిన స్థానాలు పొగ మిగిలిన అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. కడప జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. కడప, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. ఇక జమ్మలమడుగు, బద్వేలు ( ఎస్సీ ) అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు బిజెపికి కేటాయించారు. అయితే ఈ రెండు స్థానాలపై ఇప్పటికీ ఒక సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జమ్మలమడుగు స్థానంలో మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి పోటీ చేస్తారని సమాచారం ఆయన కోసమే బిజెపి నాయకత్వం పట్టుబట్టి జమ్మలమడుగు స్థానాన్ని సాధించుకుంది. అయితే ఈ స్థానం బిజెపికి కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో వెళ్లి జమ్మలమడుగు విషయంలో మరోసారి ఆలోచించాలని చంద్రబాబును కోరారు. తాను పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన విషయాన్ని చంద్రబాబుకు ఆయన వివరించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో జమ్మలమడుగు స్థానంలో బిజెపి పోటీ చేస్తుందని చంద్రబాబు మాటల్లోనే అర్థమైంది. అభ్యర్థి ఎవరు అనేది కూడా స్పష్టంగా తెలిసిపోయింది. మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి ఇక్కడి నుండి ఎన్నికల బరిలో దిగనున్నారు.

బద్వేలు విషయానికి వస్తే….

బద్వేలు అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జ రోసన్నా ఇతర ముఖ్య నేతలు విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు పరిస్థితి వివరించారు. బద్వేలు అసెంబ్లీలో కిందిస్థాయి నుండి బలంగా ఉందని చంద్రబాబుకు వారు వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకొని నాయకులు కార్యకర్తల అభిప్రాయాన్ని గుర్తించి బద్వేలు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని కోరడం జరిగింది. కానీ చంద్రబాబు పొత్తు ధర్మానికి కట్టుబడి కడప జిల్లాలో జమ్మలమడుగు బద్వేలు బిజెపికి కేటాయించినట్లు తెలిపారు. అయినప్పటికీ బద్వేలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల్లో ఆశ చావడం లేదు. ఇది ఇలా ఉండగా బద్వేలు అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పి సురేష్ బద్వేలు మాజీ ఎమ్మెల్యే జయ రాములు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు బిజెపి రాజ్యసభ సభ్యుడు రమేష్ మద్దతు తో సురేష్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే జయ రాములు పలువురు బిజెపి జిల్లా నేతలు మద్దతు ఇస్తున్నారు వీరిద్దరూ కాక మరొకరి పేరు రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుంది ఒకటి రెండు రోజుల్లో బిజెపి బద్వేలు అభ్యర్థి ప్రకటిస్తారని సమాచారం నిజానికి తెలుగుదేశం జనసేన పార్టీలు కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బిజెపి అనుకుంది. ఈ మేరకు విజయవాడలో బిజెపి రాష్ట్ర నాయకత్వం సమావేశమై జాబితాను కూడా తయారుచేసింది. ఒక్కో నియోజవర్గానికి మూడు పేర్లు ప్రతిపాదిస్తూ కేంద్ర నాయకత్వానికి నివేదికలు పంపింది. ఈ జాబితాను ప్రకటిస్తున్న సమయంలో తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు ఖరారు అయింది. ఫలితంగా అభ్యర్థుల ఎంపికను పెండింగ్ పెట్టింది. బిజెపికి రాష్ట్రంలో ఆరు పార్లమెంట్ 10 అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా వచ్చాయి. ఇప్పుడు తమకు కేటాయించిన స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జోరుగా ఊహగానాలు
మరోవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నా.యి తద్వారా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *