గంగాపురిలో నివాస గృహాలను చుట్టుముట్టిన వరద నీరు

-యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీటిని తొలగించే ఏర్పాటు చేసిన మునిసిపల్ సిబ్బంది
సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. గంగాపురి స్టేజి వద్ద ప్రధాన డ్రైనేజీ కురుకుపోవడంతో ఈ సమస్య తలెత్తింది. వరద నీరు ఇండ్లకు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద నీటి సమస్యను సోమవారం ఉదయం మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డికి తెలియజేయడంతో తమ సిబ్బందిని వెంటనే సంఘటన స్థలానికి పంపించి జెసిబి తో సహాయంతో యుద్ధ ప్రాతిపదికన వరద నీరు బయటకి వెళ్లడానికి తగు ఏర్పాటు చేశారు. పేరుకుపోయిన పూడికను తొలగించి వరద నీరు నిలవకుండా తగు చర్యలు తీసుకున్నారు. గంగపురి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *