సిరా న్యూస్, జైనథ్:
మాంగుర్లలో పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
+ చెఫ్ అవతారం ఎత్తిన విద్యార్థులు
+ వివిద రకాల వంటకాల ప్రదర్శన
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగుర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులు వివిధ రకాల వంటకాలు తయారు చేసి ప్రదర్శించారు. వంటకాల్లో ఉండే పోషక విలువల గురించి విద్యార్థులు గ్రామస్తులు, ఉపాద్యాయులకు వివరించారు. కాగా మేడిగూడ క్లస్టర్ పాఠశాల ప్రధానోపాద్యాయులు లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు ప్రదర్శించిన వంటకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు పోషకాహార ఆవశ్యకతను తెలియజేసే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడిగూడ పాఠశాల ప్రధానోపాద్యాయులు రవీందర్ గౌడ్, ఉపాద్యాయులు చంద్రకళ, అరుణ్, వినోద్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, స్థానిక నాయకులు సంతోష్, ప్రతాప్, రషీద్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.