250 మంది విద్యార్థినులకు అస్వస్థత
సిరా న్యూస్,హైదరాబాద్ :
నారాయణ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మల్లంపేట్ ORR బ్రాంచ్ గర్ల్స్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 250 విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతోతీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలం చెల్లిన పదార్ధాలను ఉపయోగిస్తూ ఆహారం వండుతున్నారని విద్యార్ధినిలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మంచినీరు సైతం పరిశుభ్రంగా ఉండటంలేదని, వంటశాల అపరిశుభ్రంగాఉంటోందని, ఆహారం విషయంలో కానీ, శుభ్రత విషయంలో కానీ నాణ్యత పాటించడంలేదని విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయిన 200 మందివిద్యార్థినిలను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించివేసింది. కళాశాలలో 2 వేలమందికి పైగా విద్యార్ధినిలు ఉండటంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.