సిరా న్యూస్,గూడూరు;
నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో ఆహార కలుషితంఅయిన ఘటనలో 75 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. — పలువురు విద్యార్థులకు తీవ్ర అశ్వస్థత కలిగింది. బాధిత విద్యార్థులను చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాసిల్దార్ రాజేంద్ర, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గురుకులం వద్దకు చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.