Forest Officer T Pranai: ప్ర‌కృతిని కాపాడాలి:  అటవీ శాఖ అధికారి టి ప్రణయ్

సిరాన్యూస్‌, బోథ్‌
ప్ర‌కృతిని కాపాడాలి:  అటవీ శాఖ అధికారి టి ప్రణయ్

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు పెంచి ప్ర‌కృతిని కాపాడాల‌ని అటవీ శాఖ అధికారి టి ప్రణయ్ అన్నారు. మండలంలోని పొచ్చెర జలపాతం వద్ద శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జల‌పాతం వద్ద శ్రమదానం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంత‌రం అటవీ శాఖ అధికారి టి ప్రణయ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన పొచ్చెర జలపాతం వద్ద మద్యం తాగవద్దని సూచించారు. ప్లాస్టిక్ వేయవద్దని సూచించారు. కార్యక్రమంలో డిఆర్ఓ అమర్ సింగ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం, ఎఫ్ బి ఓ నాగరావు, అనిల్ రాదేశం, విట్టల్ సిబ్బంది జాబిర్, అశోక్, అనిల్, భీమ్రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *