సిరా న్యూస్,నిర్మల్;
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉన్నాయని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యేవరకు స్థానిక రైతులు ప్రజలతో కలిసి ప్రభుత్వంతో సైతం పోరాటాలు చేస్తామన్నరు. సిర్గాపూర్ గ్రామం వద్ద షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతుల వద్ద నుండి భూములు లాక్కున్న ఘనత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిదేనన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ కి అనుమతులు ఇవ్వలేదని బహిరంగంగా ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు, ఈ విషయమై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫ్యాక్టరీ పై రైతులతో సంబంధిత శాఖల మంత్రులను కలిసి ఫ్యాక్టరీ రద్దుకు కృషి చేస్తా హామీ నిచ్చారు.